విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్ మైక్రో ఎంటర్ప్రైజస్ విభాగంలో ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.
111
You Might Also Like
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
35
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...
సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
32
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం...
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
22
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,...
హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్పీ
35
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్...
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
36
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...