News

స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?

113views

అయ్యప్ప దీక్షకు శబరిమల ఎంత ఫేమసో, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పచ్చు. ఈ ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫేమస్ అయిన ప్రసాదాన్ని పంపిణీ చేయద్దంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. సుమారు 6లక్షల 65వేల ప్రసాదం క్యాన్లను డిస్పోజ్ చేయాలని ఆదేశించింది హైకోర్టు. ప్రసాదం తయారీలో వాడే యాలుకుల్లో పెస్టిసైడ్స్ ఉన్నట్లు తేలటంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో 6.5 లక్షల ప్రసాదం క్యాన్లను సైంటిఫిక్ గా డిస్పోజ్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. వీటి మొత్తం విలువ 5.3కోట్ల రూపాయలు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. వీటిని డిస్పోజ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రసాదం క్యాన్ల నిర్ణీత కాలం పూర్తైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా అవి ప్రజలకు చేరవద్దని అని ఆదేశించింది. ఈ ప్రక్రియలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలని ఆదేశించింది కేరళ హైకోర్టు.