
309views
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.
వాహన సేవల వివరాలు..





