
289views
పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడి మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతోపాటు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను టీటీడి సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు.





