News

చైనా డ్రోన్‌ను అమృత్‌సర్‌లో కూల్చివేత

207views

చండీగఢ్‌: పాకిస్థాన్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున మరో డ్రోన్‌ భారత్‌లోకి చొరబడింది. అమృత్‌సర్‌కు సమీప గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లు డ్రోన్‌ శబ్దం విని అప్రమత్తమయ్యారు. భారత భూభాగంలోకి డ్రోన్‌ రాగానే కాల్పులు జరిపారు. సమీపంలో పరిశీలించగా చైనా తయారీ డ్రోన్‌ కనిపించింది. దీని ద్వారా ఏం రవాణా చేశారో తెలుసుకొనేందుకు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.