
1.1kviews
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేయడం రివాజు. అలా వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడానికి వేలాది మంది వ్యక్తులు, కార్యకర్తల అవసరం ఉంటుంది. ఆ దృష్ట్యా ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులకు సేవలు అందించడానికి “మహా కుంభ్ సేవా సంకల్ప్ కార్యక్రమం” రూపొందించబడింది. దీని ద్వారా భక్తులకు తమ సేవలు అందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. సుమారు 1000 మంది స్వయంసేవకులు ఈ ‘కుంభమేళా 2021’ లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారంతా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా తీసిన చిత్రాలే ఇవి.