శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయాలు
బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దపు నాటి పురాతన దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కొంత కాలానికి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.ప్రసిద్ధ దేవాలయాల గురించి ఎన్ని మార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు ఉన్నారని వారు అరోపిస్తున్నారు. బల్లికురవ మండలం అంటే గుర్తుకు వచ్చేది చోళరాజులు పరిపాలించిన కొణిదెన గ్రామం. ఇక్కడ అప్పట్లో రాజులు 101 బావి, కోటి ఒక్క శిలను ప్రతిష్టించారు. అప్పట్లోనే గ్రామంలో రోజులు వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి దేవాలయాలను ప్రతిష్ఠించారు. వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రెండు దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. అలానే ఈ గ్రామంలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి. పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని...








