
జమ్మూ కిష్త్వార్లోని సంగ్రాంభట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 16రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను హత్య చేశాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు మృతురాలి కుటుంబ సభ్యులు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కిష్త్వార్ జిల్లాలోని సంగ్రాంభట గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 16 రోజులకే ఒక యువకుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో పనిచేస్తున్న అమీర్ ముష్తాక్ అనే యువకుడు తన 22 ఏళ్ల భార్య యాస్మినా బేగంపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు.
యాస్మినా, ఆమిర్ ఆగస్టు 18న వివాహం చేసుకున్నారు. ఇది ఆమిర్ కు రెండో వివాహం. అతనికి మొదటి భార్య ద్వారా మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. విడాకుల తర్వాత నిందితుడు దోడా జిల్లాకు చెందిన యాస్మినాను వివాహం చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులకు హత్య గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. డెడ్ బాడీని జిల్లా ఆసుపత్రి కిష్త్వార్ మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కిష్త్వార్లోని సంగ్రాంభట గ్రామంలో, వివాహం అయిన 16 రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను పదునైన ఆయుధంతో చంపాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ను పోలీసులు అరెస్టు చేశారు, మృతుడి కుటుంబం కఠినమైన శిక్ష మరియు న్యాయమైన దర్యాప్తును డిమాండ్ చేసింది.




