పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలలో అవి మగ్గిపోతున్నాయి. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన దేశంగా అమెరికా 297 పురాతన కళాఖండాలను భారత్ కు అప్పగించింది. ఇవన్నీ భారతదేశంలో దొంగిలించి అంతర్జాతీయ విపణిలో విక్రయించినవే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వీటిని అప్పగించారు. సెప్టెంబర్ 22న ఇందుకు కృతజ్ఞత తెలియచేస్తూ మోదీ, అధ్యక్షుడు బైడెన్ కు శతధా ధన్యవాదాలని ఎక్స్ వేదికగా తెలియచేశారు. ప్రస్తుతం భారత్ కు చేరుకుంటున్న పురాతన కళాఖండాలలో సాధారణ శకం 2000 సంవత్సరం మొదలు, సాధారణ శకం 1900 సంవత్సరం మధ్య కాలానికి చెందినవి ఉన్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించే వస్తువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ఒప్పందం ఇరు దేశాలు ఈ జూలైలో చేసుకున్నాయి. ప్రస్తుతం 297 కళాఖండాలను అప్పగించారు. బైడెన్ తో వాషింగ్టన్ జరిగిన సమావేశం మధ్యలో బైడెన్ లాంఛనంగా కొన్నింటిని అప్పగించారు.
15
You Might Also Like
తిరుమల గొడుగుల ఊరేగింపు
13
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ...
ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం
15
ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్...
కోల్కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
23
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు...
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
24
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి...
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
20
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది....
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
17
మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. శరన్నవరాత్రులలో రేణుకా మాత...