News

ఉత్సాహంగా తీజ్‌ ఉత్సవాలు

22views

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్‌ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు గురువారం జరిగిన ఉత్సవాల్లో గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానిక గురునానక్‌ ఆలయం, తుల్జాభవాని ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం సా యంత్రం సాంప్రదాయ నృత్యాలు చేశారు. వెదురు బుట్టలలో ఉన్న తీజ్‌ మొక్కలను తొలగించి కులపెద్దల ఎర్రతలపాగులో గోధుమ మొక్కలను ఉంచారు. తర్వాత బుట్టలను నెత్తిన పెట్టుకుని, గ్రామసమీపంలో ఉన్న బావిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో బం జారా సంఘం నాయకులు కేశవ్‌నాయక్‌, దాసునాయక్‌, తులసిదాస్‌ నాయక్‌, కమల్‌సింగ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.