తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది. ఇందుకు రూ.22 కోట్లను కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోనుంది. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. అన్నదానం, లడ్డూ, ఇతర అవసరాలకు ఏటా రూ.800 కోట్లతో నెయ్యి సహా 30 నుంచి 40 రకాల వస్తువులను తితిదే కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలను పటిష్ఠమైన ప్రత్యేక వ్యవస్థ లేనందున తిరుమల అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో రూ.5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, రూ.9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, రూ.6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సంసిద్ధత తెలపడంతో టిటిడి ఈఓ శ్యామలరావు దృష్టికి ఈ విషయం రాగానే గత నెల 6న వైద్య ఆరోగ్య శాఖకు రాసిన లేఖలో రెండు అంతస్తుల్లో ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్కు ఎదురుగానే కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది.
39
You Might Also Like
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
26
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
34
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
24
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
43
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
100
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...