News

వైభవంగా ఒంటిమిట్ట రామయ్య పౌర్ణమి కల్యాణం

17views

ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సీతారాములకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణ వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ఆశీనులు చేసి, ప్రత్యేక అలంకరణ కావించి కల్యాణ తంతును అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం నుంచి సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు.