News

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

43views

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

స్వర్ణరథోత్స‌వంలో ఈవో జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీవాణి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.