దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 17 నుంచి 20వతేదీ(శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో దేవస్థానంలో అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి అలంకారం చేశాక శాస్ర్తోక్తంగా వేదమంత్రాల మధ్య పవిత్రమాలలను ధరింపజేస్తారు. 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాయశ్చిత విధి, వివిధ దేవతారాధనలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి మూల మంత్రహవనాలు, వేద పారాయణలు, హారతి, మంత్రపుష్పం సమర్పిస్తారు. 19వ తేదీన మండ పారాధన నిర్వహిస్తారు. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మండపా రాధన, సర్వప్రాయశ్చిత విధి, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండ బలి నిర్వహించాక 10.30 గంటలకు కలశోద్వాసన, మార్జనం, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18వ తేదీన స్నపనాభిషేక కార్యక్రమం సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు.
48
You Might Also Like
తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…
4
శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది....
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
15
రాజస్థాన్లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత...
సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..
18
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా బంగారు...
అక్టోబర్ 3 నుంచి.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
26
దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న...
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హమీద్ అలీకి 20ఏళ్ళ ఖైదు
23
త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లా కైలా షహర్ నివాసి అయిన 70 ఏళ్ళ హమీద్ అలీకి జిల్లా సెషన్స్ జడ్జి 20ఏళ్ళ జైలు శిక్ష, రూ 20వేల...
వచ్చే నెల 1,2, తేదీల్లో జనజాతి సమ్మేళనం
23
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విజయనగరంలో అక్టోబర్ 1, 2 తేదీలలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎ....