బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్ చట్టసభ (కాంగ్రెస్) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటం న్యాయసమ్మతమైనది. అయితే, హిందువులు లక్ష్యంగా ఆ దేశంలో జరుగుతున్న దాడులను ఆపాలి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యూనస్ చర్యలు తీసుకోవాలి’ అని ఎక్స్లో రో ఖన్నా పేర్కొన్నారు. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై జరుగుతున్న దాడులను తక్షణం ఆపటానికి అధికారులు, పోలీసులు కృషి చేయాలని, దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని రాజా కృష్ణమూర్తి ఒక ప్రకటనలో కోరారు. కాగా, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ప్రభుత్వం ఖండించకపోవటాన్ని పలు హిందూ అమెరికన్ సంఘాలు తప్పుబట్టాయి. దాడులను ఆపటానికి కృషి చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేర కు ‘ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం’ అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు
48
You Might Also Like
సిరిమాను చెట్టుకు బొట్టు
2
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన...
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
20
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా...
హిందుత్వపై దాడి: టిటిడిలో హిందూ ముసుగులో క్రైస్తవుల నియామకాలు
లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో...
‘మన సంస్కృతి వన సంస్కృతి అని చాటిచెప్పాలి’
22
వనాల సంస్కృతే మన దేశపు సంస్కృతి అని దేశవ్యాప్తంగా ఉన్న వనవాసీ తెగల వారందరూ ప్రపంచానికి చాటిచెప్పాలని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇక అనుమానాలు అక్కర్లేదు : టీటీడీ
20
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి...
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
46
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...