News

”ఖురాన్ మీద ఒట్టు.. నిన్ను చంపేస్తా.. ” చెప్పి మరీ మదర్సాలో విద్యార్థిని చంపేసిన మరో విద్యార్థి

41views

”ఖురాన్ మీద ఒట్టు.. నిన్ను చంపేస్తా.. జాగ్రత్త…” అని 12 ఏళ్ల అబ్బాయి… మరో విద్యార్థిని మదర్సాలో బెదిరించాడు. పిల్లడి మాటలే అనుకుంటాం కదా… అన్నంత పనీ చేసేశాడు. యూపీలోని తుల్సీపూర్ లోని ఓ మదర్సాలో మహ్మద్ అయాన్ (12) అనే విద్యార్థిని మరో విద్యార్థి చంపేశాడు. మదర్సాలోని గది నెంబర్ 15 లో అయాన్ మృతదేహాం పడి వుంది. దీంతో మహ్మద్ అయాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఏం జరిగిందని పోలీసులు విచారణ చేయగా… కొద్ది రోజుల క్రితం ఇద్దరు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఈ వాగ్వాదమే హత్యకు దారితీసిందని తేలింది.

దీంతో ఆ పిల్లవాడు మదర్సాలో వుండే మరో విద్యార్థి మహ్మద్ అయాన్ ను ఖురాన్ మీద ఒట్టు.. నిన్ను చంపేస్తానంటూ రెచ్చిపోయాడు. మొదట భయపెట్టాలని భావించి, చివరికి చంపడానికి ఓ కత్తిని కూడా ఆ విద్యార్థి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అయాన్ ను చంపేశాడు. నిందితుడు అందరూ పడుకున్న తర్వాత అయాన్ పడుకున్న గదికి వెళ్లి, కత్తితో అనేక పోట్లు పొడిచి, 12 ఏళ్ల విద్యార్థిని దారుణంగా చంపేశాడు. అంతేకాకుండా మొదట ఆ విద్యార్థి నోట్లో దిండును కూడా కుక్కి, అరుపులు బయటకి రాకుండా చేసి, చివరికి కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత శవాన్ని బెడ్ షీట్ తో కప్పేసి, తన గదికి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 103 (3) కింద కేసులు నమోదు చేశారు.