ఎంతో పురాతనమైన అమరావతి స్థూపాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశంలో కోరామని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఫోన్లో సమావేశ వివరాలను తెలియజేశారు. రాష్ట్రంలోని గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరంలలోని కట్టడాలు, స్థూపాలకు ప్రపంచ వారసత్వ కట్టడాల హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారకాల చరిత్ర అపూర్వమని తెలియజేశామని తెలిపారు. శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో మాత్రమే చేర్చిందన్నారు. శాశ్వత జాబితాలో చోటు దక్కే విధంగా కొన్ని సమస్యలను అధిగమించి యునెస్కో నియమ నిబంధన ప్రకారం నివేదిక తయారుచేసి పంపటానికి కృషి చేయాలన్నారు. జూలై 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భారతమండపంలో ప్రారంభమైన ఈ సమావేశంలో 165 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 129 కట్టడాలలో ఒక్క దానిని కూడా యునెస్కో ఫైనల్ జాబితాలో చోటు లేకపోవటాన్ని సమావేశం దృష్టికి తెచ్చామన్నారు. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ, కుఢ్య చిత్రాలకు నిలయమైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత జాబితాలో చేర్చాలని వివరించామన్నారు. యునెస్కో తాత్కాలిక జాబితాలోకి ఎంతో ఘన చరిత్ర ఉన్న అమరావతి, నాగార్జునకొండ, గండికోట, సాలిహుండం, శంకరం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరామన్నారు. ఈసమావేశాలలో తెలుగు రాష్ట్రాల నుంచి స్తపతి ప్లీచ్ ఇండియా సీఈఓ, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
36
You Might Also Like
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
48
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
39
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...