నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా, ఉగ్రవాదులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్వదేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తాము కృషి చేస్తున్న తరుణంలో ఆమె ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది. ఈ మేరకు భారత్కు అధికారికంగా తమ అభ్యంతరాన్ని చేరవేసింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని గురువారం విలేకర్ల సమావేశంలో ధ్రువీకరించారు. రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్ ఇటీవల అట్టుడికింది. ఈ నేపథ్యంలో కోల్కతాలో ఈ నెల 21న మమత మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో బెంగాల్ తలుపు తట్టే బంగ్లాదేశ్ ప్రజలకు కచ్చితంగా ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఆమె వ్యాఖ్యలు గందరగోళం సృష్టించేలా ఉన్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహ్మద్ ‘ఎక్స్’లో ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మెప్పు కోసం పొరుగు దేశం విషయంలో రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయొద్దని మమతకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ తాజాగా ‘ఎక్స్’ వేదికగా సూచించారు.
69
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
46
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
28
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
36
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
27
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
45
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...