మధ్యప్రదేశ్లోని ప్రాచీన కట్టడం భోజ్ శాల వివాదానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) సోమ వారం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. రెండు వేలకు పైగా పేజీలతో ఉన్న భారీ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి ఏఎస్ఐఐ తరపు న్యాయవాది హిమాన్షు జోషి అందజేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22 జరగనుం దని జోషి తెలిపారు. 11వ శతాబ్దంనాటి ఈ ప్రాచీన కట్టడాన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయం (భోజ్ శాల) గా, పేర్కొంటున్నారు. భోజ్శా లలో మంగళవారం రోజు హిందువులు పూజలు, శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించుకొనేలా 21 ఏళ్ల క్రితం ఓ ఏర్పాటు జరిగింది. అయితే, దీనిని హిందూ సంస్థ సవాల్ చేయడంతో వివాదం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. శాస్త్రీయ సర్వేకు న్యాయ స్థానం ఆదేశించడంతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఏఎస్ఐ సోమవారం నివేదికను అంద జేసింది. శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలన్న ముస్లింల తరఫు అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
55
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
49
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
30
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
37
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
31
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
49
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...