News

పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు

89views

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన కశ్మీరీ పండితులు, ముస్లింలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మూడు దశాబ్దాల తర్వాత తమ ఆలయం తెరుచుకుందని, తమకు సంతోషంగా వుందన్నారు. మరో కశ్మీరీ పండిట్‌ బోధరాజ్‌ భట్‌ మాట్లాడుతూ.. ఆలయం తెరుచుకోబోతోందన్న విషయం తెలుసుకొని, తాను ఢిల్లీ నుంచి వచ్చానని, హోమం, పూజల్లో పాల్గొన్నానని, ఆనందంగా వుందన్నారు. 1990లో లోయ విడిచి వెళ్లానని, ఇప్పుడు తిరిగి వచ్చినట్లు తెలిపారు.