News

రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

76views

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రాజమహేంద్రవరం శ్రీరామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంచార వైద్యశాలలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. మేనేజర్ స్వామీ రఘువీరనంద మహరాజ్, ఆఫీస్ ఇంధార్జి స్వామి వేదవిద్యానందమహరాజ్ పర్యవేక్షించారు. వైద్యులు గోలి వెంకట రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ, టీవీ సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, సంపత్ కుమార్, జీఎస్ఎల్ డాక్టర్లు సేవలందిందారు. సుమారు 253 మందికి వైద్యం అందించినట్టు స్వామీజీ తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 65 మందిని పరీక్షించారు. అవసరమైన 30 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ముగ్గురిని కంటి ఆపరేషన్లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రికి తరలించారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వలంటీర్లు ఎల్డీవీ భగీరథ రాజు, ఉదయ్ కిరణ్, మంగిరెడ్డి, జయకుమార్, ఆదిత్య పాల్గొన్నారు.