రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు తెలంగాణ సహ ప్రాంతప్రచారక్ ప్రభు కుమార్ వున్నారు. ఆయన ప్రసంగిస్తూ,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ వ్యక్తి నిర్మాణం ద్వారా నిరంతరం కృషి చేస్తోంది. సంఘం యొక్క లక్ష్యం హిందూ సంఘటనం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం. కాబట్టి సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావల్సిన స్వయంసేవకుల నిర్మాణం నిత్యశాఖలో జరుగుతుంది. అలాగే శాఖని సరైన పద్ధతిలో నిర్వహించి, ఆ శాఖలో స్వయంసేవకులుగా, రాబోయే రోజుల్లో కార్యకర్తలుగా వారిని నిర్మాణం చేస్తూ.. రాబోయే రోజుల్లో వారు సంఘటకులుగా నిర్మాణం కావడం కోసం ఇలాంటి శిక్షావర్గలు జరుగుతుంటాయి. కాబట్టి సంఘ నిర్మాణం కోసం కార్యకర్తలు అవసరం. వారిని తయారు చేయడమే ఈ సంఘశిక్షావర్గల ముఖ్య ఉద్దేశం. సంఘ శిక్షావర్గలో శారీరక, బౌద్ధిక, మానసిక శిక్షణ ద్వారా ఈ దేశం కోసం తన జీవితాన్ని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని కొంత గడుపుతూనే.. సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి సామర్థ్యం, యోజన అలాంటి ఆలోచన కలిగేటటువంటి ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు అలా తయారవుతారు. అలా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక పద్ధతుల్లో సంఘ శిక్షావర్గలు నిర్వహిస్తూ.. కార్యకర్తల నిర్మాణం జరుగుతూ వస్తోంది.
100
You Might Also Like
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
21
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5000 మందితో బందోబస్తు
12
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద...
శతకోటి సూర్యులను తలదన్నే… ప్లాస్మా ప్రవాహాలు
23
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో...
హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
19
హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల...
చైనాలో తినేవాటికి భారత్లో పూజలంటూ సనాతనధర్మంపై సీపీఎం అవహేళన
29
హిందువులపై, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సీపీఎం నేత కేపీ ఉదయభాను వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆరాధన సంప్రదాయాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
హిజ్బుత్ తహ్రీర్ కేసు: తమిళనాట 11చోట్ల ఎన్ఐఎ సోదాలు
25
‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్ను ముస్లిందేశంగా...