News

హర్యానాలో ఆవులఫై క్రూర దాడి.. రక్తపుటేరుల్లో 16 ఆవులు

78views

హర్యానాలోని ఫరీదాబాద్‌ జిల్లా ఇస్మాయిల్ పూర్‌ గ్రామంలో అత్యంత దారుణం జరిగింది. లోక్‌సభ ఫలితాలు వెలువడిన కాసేపటికే దుండగులు 16 ఆవులను పదునైన వస్తువుతో తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని జంతు ప్రేమికురాలు అర్చన ఉపాధ్యాయ గమనించారు. చనిపోయిన ఆవులను, గాయపడిన ఆవులను ఆమె గమనించారు. కొన్ని ఆవులకు పదునైన వస్తువుతో గట్టిగా పొడిచిన గాయాలు, ఎముకలు బయటికి వెళ్లి కనిపించాయి. ఇది అత్యంత క్రూరమైన చర్య అని ఆమె మండిపడిరది. దీంతో అర్చనా ఉపాధ్యాయ పల్లా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . 16 ఆవులు తీవ్ర గాయాలపాలయ్యాయని ఫిర్యాదు చేశారు. హర్యానా గోసంవర్ధన్‌ చట్టం 2015 ప్రకారం దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. వెంటనే దాడి చేసిన నిందితులను గుర్తించి, సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆసవ్త జంతు ఆస్పత్రి వ్యవస్థాపకుడు రవి దూబే కూడా ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయాలు అతి భయానకంగా వున్నాయని, మూగజీవాలపై అతి క్రూరంగా దాడులకు దిగారని మండిపడ్డారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.