News

అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్

80views

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అరుణాచలంకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనే జర్ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరువూరు నుంచి బయలుదేరి, 21వ తేదీ ఉదయం కాణిపాకం చేరుతుందని, దర్శనానంతరం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మీదుగా శుక్రవారం రాత్రి పౌర్ణమి సమయానికి అరుణాచలం క్షేత్రం చేరుకుంటుందని వివరించారు. గిరి ప్రదక్షిణ అనంతరం 22వ తేదీన కంచి, తిరుత్తణి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తి దర్శనానంతరం 23 రాత్రికి తిరువూరు చేరుతుందని తెలిపారు. ఈ బస్సుకు తిరువూరు నుంచి ఒక్కొక్క ప్రయాణి కుడికి బస్ చార్జి రూ.2800 నిర్ణయించినట్లు డీఎం తెలిపారు. ఆన్లైన్లో 95184 సర్వీసు నంబర్ తో టికెట్లు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకోవడానికి 9885661835 నంబర్లో సంప్రదించాలని కోరారు.