ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.
122
You Might Also Like
అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు....
బొట్టు పెట్టుకున్నందుకు ఐదో తరగతి విద్యార్ధిని కొట్టిన క్రైస్తవ అధ్యాపకుడు
2
బిహార్లోని బక్సర్ జిల్లాలో ఐదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. కారణం, ఆ పిల్లవాడు నుదుట బొట్టు పెట్టుకుని, చేతికి రక్షాబంధనం కట్టుకోవడమే....
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
52
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
41
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
35
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
27
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...