News

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

93views

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ప్రతి పౌర్ణమి కి తిరుమలలో గరుడవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ఆనవాయితీగా నిర్వహిస్తోంది.