News

పాఠశాలల్లో హిందూ చిహ్నాలపై క్రిస్మస్ వేడుకలు ఎలా ఆధిపత్యం చెలాయించాయి

303views

ఒక విదేశీ మత ప్రచారకుడి దృష్టిలో భారతీయ విద్యా వ్యవస్థలో మిషనరీల చొరబాటుపై పరిశోధన

ప్రపంచవ్యాప్తంగా 7,800 విద్యా సంస్థలు ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మైఖేల్ అనే ఒక విదేశీ మత ప్రచారకుడు.. 2025 లో భారతదేశానికి వచ్చాడు. పాఠశాలల మధ్య సంబంధాలను పెంచే పేరుతో.. ఆయన ఏడాది పొడవునా 9 రాష్ట్రాల్లో, సుమారు 15,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఆయన తన ప్రయాణంలో మిషనరీ పాఠశాలలు హిందూ ఆచారాలను ఎలా అణచివేస్తున్నాయో తెలిపే 32 ధృవీకరించబడిన కేసులను ఆయన గమనించారు. తిలకం తుడిచివేయబడ్డాయి, రాఖీలు తెంచబడ్డాయి, మంత్రోశ్చరణలకు శిక్షలు విధించబడ్డాయి. కానీ అదే సమయంలో.. క్రిస్మస్ వంటి వేడుకలను మాత్రం ఎంతో స్వేచ్ఛగా, ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ఇంకా వార్తా పత్రికలలో నమోదైన ఘటనల ఆధారంగా నెలవారీగా డాక్యుమెంట్ చేశాడు.

జనవరి: పరీక్ష గదిలో నిశ్శబ్దం

జనవరి 16, 2025న ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా కార్వి పట్టణంలోని సెయింట్ థామస్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న హర్ష్ పాండే అనే విద్యార్థి, స్కూల్ విరామ సమయంలో తన తోటి విద్యార్థిని “జై శ్రీరామ్” అని పలకరించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం, అతడిని ఆ రోజు జరగాల్సిన పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఈ విషయం తెలుసుకున్న హర్ష్ తండ్రి పోలీసులను ఆశ్రయించగా, వారు జోక్యం చేసుకుని విచారణ చేపట్టారు.

 

మార్చి 2025లో మైఖేల్ రాజస్థాన్‌ పర్యటనలో ఉన్నప్పుడు, జైపూర్‌లోని సోఫియా పాఠశాల తీసుకున్న ఒక నిర్ణయం చర్చనీయాంశమైంది. హోలీ పండుగ సందర్భంగా విద్యార్థులు పాఠశాలకు రంగులు తీసుకురావడాన్ని యాజమాన్యం ఖచ్చితంగా నిషేధించింది. విద్యార్థుల భద్రతను కారణంగా చూపుతూ, ఎవరైనా రంగులతో పట్టుబడితే వారిని పరీక్షలకు కూర్చోనివ్వమని తల్లిదండ్రులకు హెచ్చరికలతో కూడిన సందేశాలను పంపారు.

 

రాజస్థాన్ పర్యటన ముగించుకుని బీహార్‌ వెళ్ళినప్పుడు అక్కడ ముంగేర్ జిల్లాలో టౌన్ హైస్కూల్‌కు చెందిన సుమారు 30 మంది హిందూ విద్యార్థులు చేతికి రక్షా దారం ధరించారని ఇద్దరు క్రైస్తవ ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మే 15, 2025న పాఠశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కేవలం మతపరమైన గుర్తులను ధరించినందుకే తమ పిల్లలను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇదే తరహాలో గతంలో (సెప్టెంబర్ 25, 2024న) బక్సర్ జిల్లాలో కూడా తిలకం దిద్దుకుని, రక్షా సూత్రం కట్టుకున్నందుకు, ఒక విద్యార్థిపై దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

 

జూన్ 2025లో ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన నివేదికల ప్రకారం, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లా, సిర్జులిలోని డాన్ బాస్కో స్కూల్‌లో ఒక క్యాథలిక్ ఉపాధ్యాయుడు, ఒక హిందూ విద్యార్థి నుదుటిపై ఉన్న తిలకాన్ని బలవంతంగా తుడిచివేశారు. ఆ చిన్నారి మరోసారి జూన్ 24, 2025న తిలకం పెట్టుకుని రావడంతో.. తీవ్ర పరిణామాలు ఉంటాయని సదరు ఉపాధ్యాయుడు బెదిరించారు. భయపడిన ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపాడు.

 

ఇటు ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన మరొక వార్త మైఖేల్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. జూలై 31, 2025న దుర్గ్ జిల్లా బాగ్దుమర్ గ్రామంలోని మదర్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఏకంగా మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ ఇలా ఇవాన్ కోల్విన్.. దారుణంగా కొట్టారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో “రాధే రాధే” అని పలకరించినందుకు.. ఆ చిన్నారిపై దాడి చేయడంతో పాటు.. నోటికి టేపు వేసి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జూలై 31, 2025న ఫిర్యాదు అందడంతో, పోలీసులు సదరు ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేశారు.

 

భారతదేశమంతా రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో, ఆగస్టు 10, 2025న లక్నోలోని ఫైడెలిస్ స్కూల్‌లో ప్రార్థన సమయంలో విద్యార్థుల మణికట్టుకు ఉన్న రాఖీలను బలవంతంగా కత్తిరించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ చర్య స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలకు మరియు వివాదానికి దారితీసింది.

 

మైఖేల్ తన డైరీలో మరికొన్ని పాత ఘటనలను కూడా నమోదు చేసుకున్నారు..

బల్లియా (మే 5): సెయింట్ మేరీస్ టీచర్ 4వ తరగతి విద్యార్థి శిఖను (పిలక) కత్తిరించారు.

ఇండోర్ (డిసెంబర్ 5, 2024): సెయింట్ మైఖేల్స్ పాఠశాల తిలకం, చేతికి పవిత్ర దారం ధరించినందుకు 6వ తరగతి బాలికను ఇంటికి పంపింది.

విశాఖపట్నం: స్టెల్లా మేరిస్ పాఠశాలలో మైనర్లతో యాంటీ-దీపావళి ర్యాలీ నిర్వహించారు.

హాపూర్ (సెప్టెంబర్ 14): సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో రాఖీలను పారేసి, దేవతలను అవమానించారు.

బరేలీ (ఆగస్టు 3): హోలీ ఫ్యామిలీ పాఠశాలలో రాఖీలను కత్తెరతో కత్తిరించారు.

ఝాన్సీ (డిసెంబర్ 2): రామ్ మందిర్ గురించి వ్యాసాలు రాసినందుకు సెయింట్ మేరీస్ నుండి ఎనిమిది రోజుల బహిష్కరించారు.

ఘాజియాబాద్ (డిసెంబర్ 4): డెస్క్ మీద “జై శ్రీరామ్” అని రాసినందుకు ఓ విద్యార్థి ముఖానికి వైట్నర్ పూసి శిక్షించారు.

డిసెంబర్ ముగింపు: క్రిస్మస్ వేడుకల సందడి

సంవత్సరం చివరికి వచ్చేసరికి, పాఠశాల క్యాలెండర్లలో మైఖేల్ ఒక స్పష్టమైన మార్పును చూశారు. ఇతర పండుగల సమయంలో ఉన్న నిషేధాలు లేదా హెచ్చరికలు డిసెంబర్‌లో ఎక్కడా కనిపించలేదు. దీనికి విరుద్ధంగా, పాఠశాల కారిడార్లన్నీ క్రిస్మస్ చెట్లు మరియు జీసస్ పుట్టుకను తెలిపే దృశ్యాలతో (Nativity scenes) పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. విద్యార్థులు తమ పాఠశాల సమయాల్లోనే ఎటువంటి ఆటంకం లేకుండా క్రిస్మస్ కరోల్స్ (ప్రార్థనా గీతాలు) సాధన చేస్తూ ఉత్సాహంగా గడిపారు.

అనేక విద్యా సంస్థలలో సాధారణ ప్రార్థనల స్థానంలో క్రిస్మస్ ప్రార్థనలు చేరాయి. శాంటా క్లాజ్ సందర్శనలు, క్రైస్తవ సంప్రదాయ నాటకాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని యాజమాన్యాలు ప్రోత్సహించాయి. అయితే, వీటిని మతపరమైనవిగా కాకుండా “సమ్మిళిత సంస్కృతి” (Inclusive Culture) అని ముద్ర వేయడం గమనార్హం. గతంలో క్రమశిక్షణ పేరుతో హిందూ మత చిహ్నాలను తొలగించిన చోట, ఇప్పుడు క్రిస్మస్ ఆచారాలను సాంస్కృతిక నిబంధనలుగా అమలు చేస్తున్నాయి. సిలువలు లేదా బైబిల్ కథల ప్రదర్శనపై ఎటువంటి భద్రతా హెచ్చరికలు లేకపోవడం, కేవలం హిందూ పండుగలపైనే ఆంక్షలు విధించడం పట్ల, హిందూ సమాజంలోని కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

గమనిక: ఇందులో మైఖేల్ అనేది బహిరంగంగా నివేదించబడిన సంఘటనలను అనుసంధానించడానికి సృష్టించబడిన ఒక కల్పిత పాత్ర. పైన పేర్కొన్న అన్ని సంఘటనలు పత్రికలు మరియు సామాజిక మాధ్యమాల నివేదికల ఆధారంగా రూపొందించబడ్డాయి.