
సిమ్లాలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మసీదుపై స్థానిక హిందువులు యుద్ధం ప్రకటించారు. దీనిని అక్రమంగా నిర్మిస్తున్నారని, అక్రమాలు కూడా జరిగాయని, దానిని వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇది 30 సంవత్సరాల నాటిది మసీదు. దీని నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిజానికి ఈ మసీదు నిర్మాణ పనులను స్థానిక హిందువులు ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటీముట్టగానే వ్యవమరించింది. ప్రారంభ సమయంలో కేవలం ఒక గదినే వుండగా, ప్రస్తుతం ఐదంతస్తుల భవనం వరకూ వచ్చేసింది. ఇదంతా అక్రమమేనని నివేదికలు చెబుతున్నాయి.
అక్కడి మున్సిపల్ కార్పొరేషనే స్వయంగా ఇది అక్రమ నిర్మాణమని, అనధికారికంగా నిర్మిస్తున్నారని తేల్చేసింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేతకు ఉత్తర్వులు జారీ చేసినా… ఆ తర్వాత దీనిని వెనక్కి తీసుకున్నారు.సంజౌలిలో కొనసాగుతున్న స్టే ఆర్డర్ మరియు సుదీర్ఘ చట్టపరమైన చర్యల కారణంగా హిందువులు మరింత నిరాశకు గురయ్యారు. దీనికి ప్రతిస్పందనగా, హిందూ సంఘర్ష్ సమితి వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ మసీదుకి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెప్పినా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యా లేదని హిందూ సంఘర్ష్ సమితి మండిపడుతోంది.
అయితే.. హిందూ సంఘర్ష్ సమితి సభ్యుడు కమల్ గౌతమ్ ప్రకారం… రెండు సంవత్సరాల క్రితం దీనిని ప్రశ్నించిన సమయంలో ఓ బృందంపై దాడికి దిగిందని, అప్పుడు అసలు విషయం బయటికి వచ్చిందన్నారు.నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఒక మసీదులో ఆశ్రయం కల్పించారని తెలుస్తోంది. దీంతో హిందువులు మరింత ఆందోళనకు దిగుతున్నారు.
దీనిలో మరో కోణం కూడా వుంది. మసీదు నిర్మాణానికి గణనీయమైన నిధులు అందాయని, దీని వల్లే ఐదంతస్తుల నిర్మాఱణం జరుగుతోందని, నమాజ్ కి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కు రాష్ట్రం వెలుపల నుండి వచ్చే వారి సంఖ్య వేగంగా పెరిగిందని, రోజూ రోజూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము చాలా సార్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని, స్థానిక హిందూ మహిళల భద్రతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా గతంలో 3 శాతం ఉండేది, కానీ తక్కువ వ్యవధిలో అది గణనీయంగా పెరిగిందని అన్నారు.బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి ముస్లింలు సహా బయటి నుండి ప్రజలు రావడం ఈ పెరుగుదలకు కారణమని కూడా స్థానిక హిందువులు అంటున్నారు.





