News

ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

23views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చిన్నశేషవాహనం పై శ్రీమలయప్పస్వామి దర్శమిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాధుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసిందని అన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను టిటిడి కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు.