తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చిన్నశేషవాహనం పై శ్రీమలయప్పస్వామి దర్శమిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాధుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసిందని అన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను టిటిడి కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
23
You Might Also Like
నవరాత్రుల సందర్భంగా IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..
మీరు నవరాత్రుల సమయంలో ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా IRCTC అద్భుతమైన టూర్...
హిందూపేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ జాతీయులు
దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్...
జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది
17
జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ...
ధూప, దీప, నైవేద్య సాయం రూ.10 వేలకు పెంపు…
20
ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ...
‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’
18
భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో,...
మన దేశం నుంచే తొలిసారి కైలాస శిఖర దర్శనం
12
పరమ శివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుంచే యాత్రికులకు దర్శ నమిచ్చింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలో...