ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీని వల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున అందనుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్) అమలు చేస్తున్నారు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తాజాగా సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వు జారీచేశారు. ఇందులో రూ.7 వేలు అర్చ కుడికి భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్ లైన్ ద్వారా జమచేస్తారు. డీడీఎన్ఎస్ సాయం పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
20
You Might Also Like
నవరాత్రుల సందర్భంగా IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..
మీరు నవరాత్రుల సమయంలో ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా IRCTC అద్భుతమైన టూర్...
హిందూపేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ జాతీయులు
దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్...
జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది
16
జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ...
‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’
18
భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో,...
మన దేశం నుంచే తొలిసారి కైలాస శిఖర దర్శనం
12
పరమ శివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుంచే యాత్రికులకు దర్శ నమిచ్చింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలో...
అన్నపూర్ణాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్న దుర్గమ్మ
28
ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే...