ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీఎస్ఆర్ స్కూల్ ఆవరణలో గత రెండు రోజులుగా నిర్వహించిన జనజాతి విద్యార్థుల సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ డివిజి.శంకరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామారాజు వంటి అనేకమంది గిరిజనులు వెంట నడిచి ప్రాణాలు సైతం అర్పించారని గుర్తు చేశారు. అడవిని, నీటిని, భూమిని నిత్యం దేవతలుగా కొలుస్తూ, ప్రకృతి మాత బిడ్డలుగా గిరిజనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు జాతీయ భావాలతో, దేశం కోసం ధర్మం కోసం గిరిజన సంస్కృతినీ పరిరక్షిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, క్రీడల్లో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం అంతర్జాతీయ అంధుల క్రికెటర్ రవళి, జాతీయ స్థాయి రన్నింగ్ పోటీలో బంగారు పతకం సాధించిన సింహచలంలను సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యారంగ సమస్యలపైన తీర్మానం చేసి అమోదించారు. కార్యక్రమంలో ఏబీవీపీ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి గోవింద్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తారకేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జయచంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యుడు అంగనైని ఆనంద్, విభాగ్ కన్వీనర్ బొబ్బది సాయికుమార్, గిరిజన విద్యార్థుల కన్వీనర్ గెమ్మలి కళ్యాణ్, జిల్లా కన్వీనర్ సంపత్, ఏబీవీపీ నాయకులు, వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
19
You Might Also Like
ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!
9
మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు....
లవ్ జిహాద్తో దేశ ఐక్యతకు ముప్పు
10
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు...
తిరుమల గొడుగుల ఊరేగింపు
19
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ...
కోల్కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
23
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు...
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
29
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి...
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
22
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది....