News

తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..

30views

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్‌-తిరుపతి- చెన్నై సెంట్రల్‌ (సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌), నెం.16053/16054 డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌-తిరుపతి-డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ నెల 2 నుంచి 15వ తేది వరకు, నెం.22616/22615 కోయంబత్తూర్‌-తిరుపతి-కోయంబత్తూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు ఈ నెల 3 నుంచి 15వ తేది వరకు, నెం.22617/22618 తిరుపతి- బెంగళూరు-తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ నెల 4 నుంచి 15వ తేది వరకు అదనంగా ఒక జనరల్‌, ఒక ఛైర్‌ కార్‌ బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.