పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలలో అవి మగ్గిపోతున్నాయి. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన దేశంగా అమెరికా 297 పురాతన కళాఖండాలను భారత్ కు అప్పగించింది. ఇవన్నీ భారతదేశంలో దొంగిలించి అంతర్జాతీయ విపణిలో విక్రయించినవే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వీటిని అప్పగించారు. సెప్టెంబర్ 22న ఇందుకు కృతజ్ఞత తెలియచేస్తూ మోదీ, అధ్యక్షుడు బైడెన్ కు శతధా ధన్యవాదాలని ఎక్స్ వేదికగా తెలియచేశారు. ప్రస్తుతం భారత్ కు చేరుకుంటున్న పురాతన కళాఖండాలలో సాధారణ శకం 2000 సంవత్సరం మొదలు, సాధారణ శకం 1900 సంవత్సరం మధ్య కాలానికి చెందినవి ఉన్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించే వస్తువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ఒప్పందం ఇరు దేశాలు ఈ జూలైలో చేసుకున్నాయి. ప్రస్తుతం 297 కళాఖండాలను అప్పగించారు. బైడెన్ తో వాషింగ్టన్ జరిగిన సమావేశం మధ్యలో బైడెన్ లాంఛనంగా కొన్నింటిని అప్పగించారు.
12
You Might Also Like
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది....
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
2
మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. శరన్నవరాత్రులలో రేణుకా మాత...
ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం
16
ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన...
మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి
17
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం,...
గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ
24
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి...
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
14
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక...