News

సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్‌

24views

భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్‌ నియమితులయ్యారు. ఆ పదవి పొందిన మహిళా అధికారి ఆర్తీయే.

దేశపు 46వ డీజీఏఎఫ్ఎంఎస్‌గా నియమించబడడానికి ముందు ఆర్తీ సరీన్ నేవీలోను, ఎయిర్‌ఫోర్స్‌లోనూ డీజీఎంఎస్‌గా పనిచేసారు. పుణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌కి డైరెక్టర్ అండ్ కమాండెంట్‌గా చేసారు.

ఆర్తీ సరీన్ పుణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌లో రేడియో డయాగ్నసిస్‌లో ఎండీ చేసారు. ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని నేషనల్ బోర్డ్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమా చేసారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో గామా నైఫ్ సర్జరీలో శిక్షణ పొందారు.

ప్రస్తుతం ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఎంపికైన ఆర్తీ సరీన్ తన 38ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో విశిష్ఠ పదవులు అలంకరించారు. పుణే ఆర్మీ హాస్పిటల్‌లోరేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా పనిచేసారు. ఐఎన్ఎచ్ఎస్ అశ్వని షిప్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా చేసారు. భారత నౌకాదళం దక్షిణ, పశ్చిమ నేవల్ కమాండ్స్‌లో కమాండ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసారు