విశాఖపట్నం జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రంలో ఓ ఆవు మృతి చెందిన సంఘటనలో ఐదుగురు వైద్య ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్ చేశారు. వివరాలు ఇలా..జీవీఎంసీ 20వ వార్డు పరిధి పోలమాంబ ఆలయ ప్రాంతంలో పిన్నింటి మోహనరావుకు చెందిన చూడితో ఉన్న ఆవు ఈనెల 26న రోడ్డు డివైడర్పై ఉన్న మొక్కలు మేస్తుండగా పశు సంరక్షణ కేంద్రం సిబ్బంది పట్టుకొన్నారు. దీన్ని 13వ వార్డు పరిధి దీన్దయాల్పురంలో ఉన్న జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి సంరక్షణలో ఉన్న ఆవు ఆదివారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకొన్న ఆవు యజమాని మోహనరావు, 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్తో కలిసి సోమవారం కేంద్రానికి చేరుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన ఆవు మృతి చెందిందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోన్–2 ఏఎంహెచ్వో డాక్టర్ కిశోర్ కేంద్రానికి చేరుకొని మృతి చెందిన ఆవును పరిశీలించారు. నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, పాడి, చూడితో ఉన్న ఆవులను రోడ్లపై విడిచిపెట్టవద్దని ఆవు యజమానికి సూచించారు.
27
You Might Also Like
ఆంజనేయస్వామి మూలవిరాట్ అపహరణ
21
శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత...
దసరా పండుగ విశిష్టత ఇదీ!
( దసరా ప్రత్యేకం) ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...
సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్
17
భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నియమితులయ్యారు. ఆ...
దేశభక్తి నినాదాలు చేసినందుకు పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్
కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు...
దేశం కోసం జీవించిన అరుదైన వ్యక్తులలో అగ్రగణ్యులు లాల్బహదూర్ శాస్త్రి.
( అక్టోబర్ 2 - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ) రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత...
పలికెడిది గాంధీ కథ యట…
( అక్టోబర్ 2 - గాంధీజీ జయంతి ) పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్ కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో...