News

1న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

27views

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.