News

అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

8views

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు.

ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన పదార్థాలనే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందజేయాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో బయటి వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని సత్యేంద్ర దాస్ కోరారు. తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలో ఉండటం ఉత్తమం అన్నారు.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అలాగే మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.