0
సనాతన నియమాలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పద్మవిభూషణ్, ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కొత్త సచ్చితానందమూర్తి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయలు, తాత్వికులు, ఆధ్యాత్మికవాధుల వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఏయూ ప్రొఫెసర్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షునిగా, పలు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా కొత్త సచ్చితానందమూర్తి బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు.