News

సనాతన ధర్మాన్ని కాపాడాలి

0views

సనాతన నియమాలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పద్మవిభూషణ్‌, ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ కొత్త సచ్చితానందమూర్తి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయలు, తాత్వికులు, ఆధ్యాత్మికవాధుల వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఏయూ ప్రొఫెసర్‌గా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉపాధ్యక్షునిగా, పలు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా కొత్త సచ్చితానందమూర్తి బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు.