News

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

18views

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వ హిస్తున్నందున అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. అందువల్ల వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. అలాగే ఉత్సవాల పోస్టర్లను వాడవాడలా అతికించాలన్నారు. కార్యక్రమంలో ఈవో వాకచర్ల రాధాకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు