News

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

23views

గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్‌మ్యాన్‌ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్‌ జిల్లాలోని కోసంబ- కిమ్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను కలిపే ఫిష్‌ప్లేట్లను తొలగించడంతోపాటు, 40-50 బోల్టులను వదులు చేశారు. రెండు ఫిష్‌ ప్లేట్లను తొలగించి పక్కనున్న ట్రాక్‌పై పెట్టారు. తెల్లవారు జాము 5.30 గంటల సమయంలో దీన్ని గమనించిన లైన్‌మ్యాన్‌ అధికారులను అప్రమత్తం చేశాడు. ఇంజినీర్లు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసిన తరువాత రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.