సాధారణంగా ఆలయాల్లో రావి, వేపచెట్లు కలిసి కానీ, విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణుస్వరూపం, వేప లక్ష్మీస్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని ‘పద్మపురాణం’ పేర్కొంది. రావికి బోధివృక్షం, అశ్వత్థ వృక్షమనే పేర్లున్నాయి. పురాణేతిహాసాల్లో రావిచెట్టుకు ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడన నిలబడటం, నమస్కరించడం, ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషం తొలగుతుంది. రావికొమ్మలు యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తారు. సాధువులు రావి కొమ్మను దండంగా చేసుకుంటారు. రావిచెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు. ఇక వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం. అనేక రోగాలను నయం చేస్తుంది. రావి, వేప కలిసి కనుక ఉంటే.. అక్కడ మహా శక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెబుతారు. వేపచెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలే గానీ కుడి, ఎడమ భాగాల్లో ఉండకూడదు. రావిచెట్టును ఇంటి వద్ద నాటకూడదు.
22
You Might Also Like
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
16
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
15
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
16
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...
ఫిష్ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర
23
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్...
జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన
21
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు...