4
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (ఎస్ఓయూ)’ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహా విగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. ‘జై వీర హనుమాన్’ నామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది.