News

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం

28views

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్‌ జి.సృజన తెలిపారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నవహారతులు ఇచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆమె సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పవిత్ర సంగమాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దసరా నాటికి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 1.7 కిలోమీటర్ల గల సంగమం రోడ్డు భవిష్యత్తులో దెబ్బతినకుండా పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.