39
సోదరీ సోదర అనురాగ బంధాన్ని మరింత పటిష్టం చేసే వేడుక రక్షాబంధన్ (రాఖీ). ఈ పండుగను సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పంచ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా రక్షాబంధన్ రోజు నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాశ్ తెలిపారు.