News

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23న వరలక్ష్మీ వ్రతం

49views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రూ.1,500 ఆర్జితసేవా టికెట్‌ ఉన్న భక్తులతో వ్రతం నిర్వహించనున్నారు.

తెల్లరేషన్‌ కార్డు ఉన్న భక్తులు ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా వ్రతంలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే మహిళా భక్తుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.