న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన రైతులు దోమ మోహనరావు, పుణ్యవతి దంపతులకు ఆహ్వానం అందింది. మోహనరావు దంపతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగించి.. యాంత్రీకరణ విధానం ద్వారా అధిక దిగుబడి సాధించారు. బిందుసేద్యం ద్వారా మెట్టు పంటలు పండించి ఉత్తమ రైతుగా గుర్తింపు పొందారు. సాగులో ఈ దంపతుల ప్రతిభను గుర్తిస్తూ.. పీఎం కిసాన్ పథకం కింద వారిద్దరినీ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపిక చేసినట్టు స్థానిక వ్యవసాయాధికారి సువ్వారి గోవిందరావు తెలిపారు. వీరి ఎంపికపై జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, గోవిందరావుతోపాటు పలు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా.. రానున్న రోజుల్లో ఎరువులు, రసాయనాలు లేకుండా ఆర్గానిక్ పంటలు పండించేలా దృష్టి సారిస్తున్నానని రైతు మోహనరావు తెలిపారు. సఫలీకృతమైతే జిల్లావ్యాప్తంగా ఈ విధానంపై ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
45
You Might Also Like
మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం,...
భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత
పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి....
గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ
20
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి...
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
11
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక...
దుర్గా మండపంలో గోవు తల: ఛాందసుల పనేనన్న హిందువులు
28
హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అత్యంత నిష్ఠతో మాంసం, మద్యానికి దూరంగా వుండి అమ్మవారిని కొలుస్తారు. కానీ... బెంగాల్ లో ఘోరం జరిగింది. బెహార్ జిల్లాలోని...