ఓ వైపు బంగ్లాదేశ్ లోని హిందువులను చిత్ర హింసలు పెడుతూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ… ఇస్లామిక్ మూకలు భయోత్పాదం సృష్టిస్తున్న సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఏషియా విభాగం ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 12 పేజీల ఈ ప్రకటన దాని నాయకుడు ఒసామా మహమూద్ పేరుతో విడుదలైంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసినందుకు ప్రజలను అభినందించాడు. ఇస్లామిస్టులకు, జిహాదీలకు ఇదో పెద్ద విజయంగా అందులో అభవర్ణించాడు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎవ్వరూ భాగస్వాములు కావొద్దని, బంగ్లాదేశ్ లో నూటికి నూరుపాళ్లు షరియా పాలనను స్థాపించే ప్రయత్నాలల్లో నిమగ్నమై వుండాలని కూడా ఈ లేఖలో సూచించాడు. ఈ విషయంపై నిరంతర ప్రయత్నాలుండాలని ఒసామా మహమూద్ అన్నాడు. బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా వెతక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ఓ వైపు కాగా.. మరో వైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన ‘‘జమాతే ఇస్లామీ’’ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్లోని మోగ్ బజార్ బోరో బజార్లో ప్రారంభించింది. నిజానికి షేక్ హసీనా ఈ సంస్థను నిషేధించింది. ఇప్పుడు ఆమె దేశంలో లేకపోవడంతో మళ్లీ ఈ ఛాందవాస సంస్థ తన కార్యాకలాపాలను ప్రారంభించిందంటే పరిస్థితి అక్కడ ఎలా వుందో ఊహించుకోవచ్చు. అలాగే పార్టీ మాజీ అధ్యక్షుడు మోతియుర్ రెహ్మన్ నిజామీ, మాజీ ప్రధాన కార్యదర్శి అలీ అహ్సన్ మహ్మద్ ముజాహిద్ను యుద్ధ నేరాల ఆరోపణలపై ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ కార్యాలయాన్ని మూసేశారు.
42
You Might Also Like
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
15
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది....
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
12
మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. శరన్నవరాత్రులలో రేణుకా మాత...
ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం
27
ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన...
మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి
18
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం,...
భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత
12
పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి....
గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ
25
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి...