డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి రామేశ్వరం తీర్థ యాత్రల ప్రత్యేక బస్ సర్వీస్ ఈ నెల 17న బయలు దేరుతుందని ఆ డిపో మేనేజర్ కేడీఎంఎస్ కుమార్ తెలిపారు. కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామేశ్వరం తీర్థయాత్రల విశిష్టత, దర్శనం నిమిత్తం భక్తుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పుష్ బ్యాక్ 2 ప్లస్ 2 సిటింగ్ గల సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామన్నారు. 17న రావులపాలెం కాంప్లెక్స్లో బస్సు బయలుదేరి 24న తిరిగి వస్తుందన్నారు. ఏడు రోజుల తీర్థయాత్రలో కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, శ్రీరంగం, జంబుకేశ్వరం, పళని, కోయంబత్తూరు (ఈశా ఫౌండేషన్), మధురై, రామేశ్వరం, ధనుష్కోడి, తంజావూరు, కాంచిపురం, శ్రీకాళహస్తి, విజయవాడ దేవాలయాల దర్శనం చేయిస్తారన్నారు. టిక్కెట్ చార్జి ఒకరికి రూ.8,500 (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్తో సహా) ఉంటుంది. రూమ్ అద్దెలు యాత్రికులే భరించాలని తెలిపారు. యాత్రలకు వచ్చే ప్రయాణికులు అసిస్టెంట్ మేనేజర్ 73829 11871, ఆర్ఎస్ రావు 73829 12398, వీరభద్రరావు 73829 12400 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
60
You Might Also Like
ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!
57
మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు....
లవ్ జిహాద్తో దేశ ఐక్యతకు ముప్పు
30
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు...
తిరుమల గొడుగుల ఊరేగింపు
36
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ...
ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం
31
ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్...
కోల్కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
32
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు...
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
39
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి...