హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి. వీరిలో అత్యధికులు హిందువులు కావడం గమనార్హం. గత సోమవారం ఆ దేశప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ హిందువులు , బౌద్ధులు, ఇతర మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. వారి ఆస్తులు, వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు. అవామీలీగ్ పార్టీకి చెందిన ఇద్దరు హిందూ నేతలు హత్యకు కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాణభయంతో పలువురు భారత్ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. శుక్రవారం బెంగాల్లోని కూచ్బిహార్ జిల్లా సీతల్కుచీ సరిహద్దు కంచె దూకి వచ్చేందుకు వెయ్యి మంది ప్రయత్నించగా భారత బలగాలు వమ్ముచేశాయి. సరిహద్దుకు సమీపంలో వారంతా సమావేశమై తమను భారత్కు రానివ్వాలని నినాదాలు చేశారు.
39
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
18
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
24
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
35
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
27
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...