News

మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

44views

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.

ప్రకృతి సృష్టించిన విపత్తు కారణంగా కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. కేరళనకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకదాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోను కేరళ ప్రభుత్వం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.